Share News

వంశధార నదిలో ప్రమాద వశాత్తు పడి విద్యార్థిని మృతి

ABN , Publish Date - May 08 , 2024 | 11:35 PM

పాత హిరమండలం కుమ్మరి వీధికి చెందిన కుమ్మరి బాలమాధురి (15) వంశధార నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గుమ్మిలో దిగి మృతి చెందిన ఘటన బుధవారం సంభవించింది. ఎస్‌ఐ నారాయణ స్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మధురి ప్రతిరోజు తన తల్లి తులసమ్మతో కలిసి గ్రామం పక్కనే ఉన్న నదిలో స్నానానికి వెళ్తుండేది. బుధవారం ఉదయం తల్లికి పని ఉండడంతో తోటి స్నేహితులు కుమ్మరి రాజేశ్వరి, కొర్లాపు దుర్గలతో కలిసి నదికి వెళ్లింది. ముగ్గురు నదిలో స్నానం చేస్తుండగా మాధురి మునిగి కనిపించకుండా పోయింది. దీంతో స్నేహితులు కేకలు పెట్టడంతో కొంత దూరంలో స్నానం చేస్తున్న మాధురి తండ్రితో పాటు మరికొందరు అక్కడకు చేరుకొని నదిలో వెతికారు. కొంతసేపటికి మృతదేహం ఆమె తండ్రికే దొరికింది. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. మృతురాలు హిరమండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది తొమ్మిది చదివి పదో తరగతికి వచ్చింది. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ నారాయణ స్వామి తెలిపారు.

వంశధార నదిలో ప్రమాద వశాత్తు పడి విద్యార్థిని మృతి

హిరమండలం: పాత హిరమండలం కుమ్మరి వీధికి చెందిన కుమ్మరి బాలమాధురి (15) వంశధార నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గుమ్మిలో దిగి మృతి చెందిన ఘటన బుధవారం సంభవించింది. ఎస్‌ఐ నారాయణ స్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మధురి ప్రతిరోజు తన తల్లి తులసమ్మతో కలిసి గ్రామం పక్కనే ఉన్న నదిలో స్నానానికి వెళ్తుండేది. బుధవారం ఉదయం తల్లికి పని ఉండడంతో తోటి స్నేహితులు కుమ్మరి రాజేశ్వరి, కొర్లాపు దుర్గలతో కలిసి నదికి వెళ్లింది. ముగ్గురు నదిలో స్నానం చేస్తుండగా మాధురి మునిగి కనిపించకుండా పోయింది. దీంతో స్నేహితులు కేకలు పెట్టడంతో కొంత దూరంలో స్నానం చేస్తున్న మాధురి తండ్రితో పాటు మరికొందరు అక్కడకు చేరుకొని నదిలో వెతికారు. కొంతసేపటికి మృతదేహం ఆమె తండ్రికే దొరికింది. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. మృతురాలు హిరమండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది తొమ్మిది చదివి పదో తరగతికి వచ్చింది. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ నారాయణ స్వామి తెలిపారు.

Updated Date - May 08 , 2024 | 11:35 PM