Share News

సీఎం చంద్రబాబుతో టీ మంత్రి ఉత్తమ్‌ భేటీ

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:32 AM

ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అభినందించారు.

సీఎం చంద్రబాబుతో టీ మంత్రి ఉత్తమ్‌ భేటీ

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అభినందించారు. తన మిత్రుడి ఇంట జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు గురువారం విజయవాడకు వచ్చిన ఉత్తమ్‌ దంపతులు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మంత్రి ఉత్తమ్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కేవలం మర్యాదపూర్వకమే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలేవీ ప్రస్తావనకు రాలేదు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించాక హైదరాబాద్‌ వచ్చినా కలవడం కుదరలేదు. నా స్నేహితుడి ఇంట దశదినకర్మల కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చా. ఈ సందర్భంగా ఆయనను కలసి అభినందనలు తెలిపా. ఇరువురి మధ్య స్నేహపూర్వక, పరస్పర అభినందనలు మినహా రాష్ట్రాల మధ్య అంశాలు ప్రస్తావనకు రాలేదు’ అని స్పష్టం చేశారు.

Updated Date - Sep 13 , 2024 | 04:32 AM