పాలీసెట్లో జిల్లా ఉత్తీర్ణత 89.02%
ABN , Publish Date - May 09 , 2024 | 02:06 AM
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (పాలీసెట్) ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.
కంచరపాలెం, మే 8:
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (పాలీసెట్) ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. విశాఖ జిల్లా 89.02ు ఉత్తీర్ణతా శాతం సాధించింది. ఈ ఏడాది పరీక్షకు 12,147 మంది (7,265 మంది బాలురు, 4,882 మంది బాలికలు) హాజరయ్యారు. వీరిలో 6,379 మంది బాలురు, 4,434 బాలికలు కలిసి 10,813 మంది ఉత్తీర్ణులయ్యారు.