Share News

నేడు చంద్రబాబు రాక

ABN , Publish Date - May 09 , 2024 | 01:59 AM

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం నగరంలోని సీతంపేటలో నిర్వహించనున్న ఎన్నికల సభలో పాల్గొననున్నారు.

నేడు చంద్రబాబు రాక

సాయంత్రం 6 గంటలకు సీతంపేటలో సభ

విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం నగరంలోని సీతంపేటలో నిర్వహించనున్న ఎన్నికల సభలో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బస చేస్తారు. అయితే జగదాంబ జంక్షన్‌ నుంచి పూర్ణామార్కెట్‌ మీదుగా సీతంపేట వరకు చేపట్టాల్సిన రోడ్‌షో రద్దు అయినట్టు పార్టీ నగర అధ్యక్షుడు గండి బాబ్జీ తెలిపారు. చంద్రబాబునాయుడు గురువారం ఉదయం 9.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.35 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 10.40 గంటలకు హెలికాప్టర్‌లో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వెళ్లి ఎన్నికల సభలో పాల్గొంటారు. ఆ తరువాత విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎన్నికల సభకు హాజరై సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్‌లో విశాఖపట్నం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు సీతంపేటలో నిర్వహించనున్న సభ వద్దకు చేరుకుంటారు. అక్కడ రాత్రి 7.30 గంటల వరకు ప్రసంగించనున్నారు. రాత్రికి సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి వెనుక ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బస చేస్తారు.

Updated Date - May 09 , 2024 | 01:59 AM