Share News

Road Accident: విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

ABN , Publish Date - Mar 12 , 2024 | 06:57 AM

విశాఖ జిల్లా: పెందుర్తి నేషనల్ హైవే వద్ద మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుణుపూర్ నుంచి హైదరాబాద్‌కు ఐరన్ స్క్రాప్ లోడుతో వస్తున్న లారీ పెందుర్తి జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఎన్ శేఖర్ రెడ్డి (55) అక్కడికక్కడే మృతి చెందాడు.

Road Accident: విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

విశాఖ జిల్లా: పెందుర్తి నేషనల్ హైవే (National Highway) వద్ద మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గుణుపూర్ నుంచి హైదరాబాద్‌కు ఐరన్ స్క్రాప్ లోడుతో వస్తున్న లారీ పెందుర్తి జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఎన్ శేఖర్ రెడ్డి (55) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని .. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆస్పత్రికి (KGH Hospital) తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిద్ర లేకుండా కంటిన్యూ డ్రైవింగ్ చేయడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని లారీ డ్రైవర్లు అంటున్నారు.

Updated Date - Mar 12 , 2024 | 06:57 AM