ఉదయం ఎండ.. సాయంత్రం వాన
ABN , Publish Date - May 09 , 2024 | 01:23 AM
మన్యంలో బుధవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీవ్రంగా ఎండకాసింది. ఆ తరువాత ఆకాశమంతా కారు మబ్బులు కమ్మేసి వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. సుమారుగా గంటపైబడి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
- తగ్గిన ఉష్ణోగ్రతలు
- చల్లబడిన వాతావరణం
పాడేరు, మే 8(ఆంధ్రజ్యోతి): మన్యంలో బుధవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీవ్రంగా ఎండకాసింది. ఆ తరువాత ఆకాశమంతా కారు మబ్బులు కమ్మేసి వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. సుమారుగా గంటపైబడి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి వాతావర ణం చల్లబడింది. దీంతో వేడికి అల్లాడుతున్న జనం ఉపశమనం పొందారు.
స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
మన్యంలో బుధవారం కురిసిన వర్షం ప్రభావంతో ఉష్ణోగ్రతలు సైతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులతో పోలిస్తే ఒకటి నుంచి రెండు డిగ్రీలు తగ్గాయి. అనంతగిరిలో 35.6, అరకులోయలో 32.9, చింతపల్లిలో 33.1, డుంబ్రిగుడలో 33.7, జీకే8వీధిలో 33.1, జి.మాడుగులలో 32.8, హుకుంపేటలో 33.2, కొయ్యూరులో 33.7, ముంచంగిపుట్టులో 35.4, పాడేరులో 33.2, పెదబయలులో 34.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.