24 గంటలూ అందుబాటులో ఉంటా
ABN , Publish Date - May 09 , 2024 | 12:40 AM
తాను పార్వతీపురం నియోజకవర్గ ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు.
సీతానగరం: తాను పార్వతీపురం నియోజకవర్గ ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. సీతానగరం మండలంలోని పెదభోగిల, దయానిధిపురం, కాశీపేట పంచాయతీల్లోని గ్రామాల్లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యంనాయుడు, వేణుగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి సూపర్సిక్స్ పథకాలపై వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో క్రీడామైదానం ఏర్పాటు చేస్తానని, ఇంటి వద్దకే ప్రజాపాలన చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటువేసి, తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో అడుగడుగునా ఆయనకు ఘన స్వాగత లభించింది. ఈ కార్యక్రమంలో పెదభోగిల సర్పంచ్ తేరిజమ్మ, గరికయ్య, వైస్ సర్పంచ్ కె.అరవింద్, సీనియర్ నాయకులు హరిబాబు, కాశీపేటకు చెందిన వెంకట అప్పలనాయుడు, శేఖర్, తిరుపతి, దయానిధిపురం సర్పంచ్ రామారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.