మీ ఆడపడుచును ఆశీర్వదించండి
ABN , Publish Date - May 09 , 2024 | 12:37 AM
‘మీ ఇంటి ఆడపడుచుగా వచ్చాను.. నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి నన్ను గెలిపించండ’ని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి కోరారు.
జియ్యమ్మవలస: ‘మీ ఇంటి ఆడపడుచుగా వచ్చాను.. నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి నన్ను గెలిపించండ’ని కూటమి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి కోరారు. మండ లంలోని కన్నపుదొరవలస, ఎం.అల్లువాడ, తుంబలి, జోగులడుమ్మ పంచాయతీ లలో ఆమె బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు ఎ.మహేష్, అరకు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణలతో కలిసి ఆమె ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నపుదొరవలస, పిప్పలభద్ర గ్రామాల నుంచి వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
గరుగుబిల్లి: కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ అరకు బీసీ సెల్ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి సత్యనారాయణ కోరారు. ఈ మేరకు చిలకాం గ్రామంలో ఆయన బుధవారం మాట్లాడారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో అరకు పార్లమెంటు అభ్యర్థి కొత్తపల్లి గీతను, కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరిలను గెలపించాలని కోరారు. టీడీపీ ప్రతినిధులు వై.నారాయణరావు, జి.కృష్ణ, డి.స్వామినాయుడు, బి.మోహన్రావు, బి.ధనుంజయరావు, గౌరునాయుడు, శివున్నాయుడు, ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ గౌరమ్మ, తదితరులు పాల్గొన్నారు.