Share News

9 జిల్లాలు దాటి వచ్చి ఓటు వేసి..

ABN , Publish Date - May 09 , 2024 | 12:22 AM

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన ఉత్తరాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకుడు భరత్‌భూషణ్‌రాజ్‌ సతీమణి కావూరు రాజశ్రీ ఏలూరులో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.

9 జిల్లాలు దాటి వచ్చి ఓటు వేసి..

పాలకొండ, మే 8: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన ఉత్తరాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకుడు భరత్‌భూషణ్‌రాజ్‌ సతీమణి కావూరు రాజశ్రీ ఏలూరులో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. కొన్ని కారణాలు కారణంగా ఆమెకు బ్యాలెట్‌ ఓటు ఏలూరుకు ట్రాన్స్‌ఫర్‌ కాలేదు. దీంతో ఆమె ఎన్నికల విధుల శిక్షణ పూర్తి చేసుకుని బుధవారం బయలుదేరి పాలకొండ చేరుకున్నారు. ప్రజాస్వామ్యం తనకు కల్పించిన ఓటును బాధ్యత ఉన్న పౌరురాలిగా పాలకొండలో ఓటేసి తిరిగి ఏలూరు ప్రయాణమయ్యారు.

430 కిలోమీటర్లు దాటి ప్రయాణం

ఆమె 430 కిలోమీటర్ల దూరం సుమారు 9 గంటలు ప్రయాణం చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా మీదుగా పార్వతీపురం మన్యం జిల్లాకు చేరుకున్నారు.

Updated Date - May 09 , 2024 | 12:22 AM