Share News

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

ABN , Publish Date - May 09 , 2024 | 12:32 AM

దల్లిపేట గ్రామానికి చెందిన దల్లి అ ప్పలరాముడు(65) ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికి త్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పలరాముడు భార్య గతే డాది జూన్‌లో మృతి చెందింది.

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

భోగాపురం: దల్లిపేట గ్రామానికి చెందిన దల్లి అ ప్పలరాముడు(65) ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికి త్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పలరాముడు భార్య గతే డాది జూన్‌లో మృతి చెందింది. అప్పటి నుంచి అప్పలరా ముడు విచారంతో మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం అప్పలరాముడు ఇంటికి వారి బంధువు ఒకాయిన వెళ్లాడు. ఆయన వెళ్లేసరికి అప్పల రాముడు ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. నోటిలో నురగలు కూడా ఉన్నాయి. పక్కనే పినాయల్‌ డబ్బా ఉంది. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానించి బంధువు చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. అప్పలరాముడు అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తు న్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 12:32 AM