Share News

ఓటు హక్కు వినియోగించుకోండి: ఎస్పీ

ABN , Publish Date - May 09 , 2024 | 12:31 AM

ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియో గించుకోవాలని ఎస్పీ ఎం.దీపికాపాటిల్‌ పిలుపు నిచ్చారు. బుధవారం ముక్కాం గ్రామంలో ఓటుహక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు

 ఓటు హక్కు వినియోగించుకోండి: ఎస్పీ

భోగాపురం: ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియో గించుకోవాలని ఎస్పీ ఎం.దీపికాపాటిల్‌ పిలుపు నిచ్చారు. బుధవారం ముక్కాం గ్రామంలో ఓటుహక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు ఎటు వంటి భయబ్రాంతులకు, ప్రలోభాలకు గురికావద్దుని అన్నారు. జిల్లాలో ఓటింగు శాతాన్ని పెంచేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ఓటర్లకు ఏవైనా ఇ బ్బందులు ఎదురైతే పోలీసులకు ఫిర్యాదులు చేయాలన్నారు. ఎన్నికల్లో ఎటువంటి అ వాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆర్‌.గోవిందరావు, సీఐ ఎ.రవికుమార్‌, పోలీస్‌ సిబ్బంది, ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు గ్రామాలకు చెందిన ఓటర్లు, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:32 AM