Share News

జామిలో కేఏ పాల్‌ సందడి

ABN , Publish Date - May 09 , 2024 | 12:34 AM

మండల కేం ద్రమైన జామిలో ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకు డు, విశాఖ ఎంపీ అభ్య ర్థిగా పోటీచేస్తున్న కేఏ పాల్‌ సందడి చేశారు. బుధవారం జామి బజా రు సెంటర్‌కు కారులో వచ్చిన కేఏపాల్‌ కారు పైకెక్కి ఒక మట్టి కుం డను చూపిస్తూ కుండ గుర్తుపై ఓటువేయాలని కోరారు

జామిలో కేఏ పాల్‌ సందడి

జామి: మండల కేం ద్రమైన జామిలో ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకు డు, విశాఖ ఎంపీ అభ్య ర్థిగా పోటీచేస్తున్న కేఏ పాల్‌ సందడి చేశారు. బుధవారం జామి బజా రు సెంటర్‌కు కారులో వచ్చిన కేఏపాల్‌ కారు పైకెక్కి ఒక మట్టి కుం డను చూపిస్తూ కుండ గుర్తుపై ఓటువేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు చేతిలో రూ.లక్ష కూడా లేని బొత్స నేడు నేడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఆయన కుటుంబంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉంచుకుని వేల ఎక రాలు భూమిని దొచుకున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్‌, సైకిల్‌, కమలం గుర్తులపై కాకుండా కుండ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా తనను గెలిపిస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తానని తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 12:34 AM