Share News

అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా

ABN , Publish Date - May 09 , 2024 | 12:38 AM

‘మీ ఇంటి ఆడపిల్లగా ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తాన’ని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా

సాలూరు: ‘మీ ఇంటి ఆడపిల్లగా ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తాన’ని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆమె బుధవారం ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. సాలూరు పట్టణంలోని ఆరో వార్డులో సాలూరు జమిందార్‌ యువరాజు విక్రమ్‌చంద్ర సన్యాసిరాజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు వైసీపీకి చెందిన యువ నాయకుడు కిలారి రవికుమార్‌, పలువురు టీడీపీలో చేరారు. వారిని సంధ్యారాణి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ పార్టీ కండువా వేసి, ఆహ్వానం పలికారు. అనంతరం ఆమె తన నివాసం వద్ద విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి, మాట్లాడారు. టీడీపీ హయాంలో వంద పడకల ఆసుపత్రి మంజురైతే ఈ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కనీసం పనులు పూర్తి చేయలేదని ఆమె ఆరోపించారు. మూడు సాగునీటి ప్రాజెక్టులకు జైకా నిధులు తెస్తే కనీసం 20 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. అప్పట్లో రూ.4కోట్లతో తాగునీటి ట్యాంకులు ఏర్పా టు చేశానని, పాచిపెంటలో రూ.3కోట్ల 50 లక్షలతో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేశానని తెలిపారు.

మక్కువ: కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతలను గెలిపించాలని కోరుతూ చెముడు గ్రామంలో బుధవారం టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు పెంట తిరుపతిరావు ప్రచారం చేశారు. పార్టీ నాయకులు చొక్కాపు బుచ్చినాయుడు, చింతల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:39 AM