Share News

YSRCP: అక్రమంగా పార్టీ ఆఫీసుల నిర్మాణాల వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:09 PM

రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కూల్చివేయబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్దమైందని వైసీపీ పేర్కొంది.

YSRCP: అక్రమంగా పార్టీ ఆఫీసుల నిర్మాణాల వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కూల్చివేయబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్దమైందని వైసీపీ పేర్కొంది. అయితే తాను ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానంటూ ప్రభుత్వం తరుపున హాజరైన న్యాయవాది కోర్టుకు తెలిపారు.

తాము ఇప్పటికిప్పుడు కూల్చివేయబోవడం లేదని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామని తెలిపారు. దీంతో కేసు విచారణ రేపటికి (గురువారం) వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. అప్పటివరకు యథాతథ స్థితిని పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Jun 26 , 2024 | 05:11 PM