Share News

Jio: జియో దీపావళి ధమాకా ఆఫర్.. ఏడాదిపాటు ఇంటర్‌నెట్ ఫ్రీ

ABN , Publish Date - Sep 18 , 2024 | 01:11 PM

రిలయన్స్ జియో(Jio) నుంచి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు సంవత్సరం పాటు ఉచిత Jio AirFiber కనెక్షన్‌ని పొందవచ్చు. దీని ద్వారా మీరు సంవత్సరం పాటు ఉచిత 5G ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకోవచ్చు.

Jio: జియో దీపావళి ధమాకా ఆఫర్.. ఏడాదిపాటు ఇంటర్‌నెట్ ఫ్రీ
jio AirFiber

దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో అనేక కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో 'దీపావళి ధమాకా' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు సంవత్సరం పాటు ఉచిత Jio AirFiber కనెక్షన్‌ని పొందవచ్చు. దీని ద్వారా మీరు సంవత్సరం పాటు ఉచిత 5G ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 3, 2024 వరకు మాత్రమే Reliance Jio లేదా MyJioలో కొనుగోళ్లు చేసే కస్టమర్‌లకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్ షరతులు ఏంటి, ఎలా తీసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


12 నెలల పాటు

ఈ ఆఫర్‌ను పొందేందుకు కొత్త కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ లేదా MyJio స్టోర్‌ల నుంచి రూ. 20,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి లేదా కొత్త ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ కోసం రూ. 2,222 మూడు నెలల అడ్వాన్స్ ప్లాన్ తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న జియో కస్టమర్లు దీపావళి ప్లాన్‌తో వన్ టైమ్ అడ్వాన్స్ రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ కింద అర్హత కలిగిన కస్టమర్లు 12 నెలల పాటు ఉచిత JioAirFiber సభ్యత్వాన్ని పొందుతారు. మీరు ఈ కూపన్‌ను 30 రోజుల్లోగా రీడీమ్ చేసుకోవాలి.


కస్టమర్లకు

అదే సమయంలో ఈ కూపన్‌లను రిలయన్స్ డిజిటల్, MyJio స్టోర్‌లు, JioPoint స్టోర్‌లు లేదా JioMart డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో రూ. 15,000 కంటే ఎక్కువ కొనుగోలు చేసేటప్పుడు రీడీమ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా తమ కస్టమర్లకు దీపావళి షాపింగ్ సమయంలో మెరుగైన అనుభూతిని అందించాలనుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా డిజిటల్ కనెక్టివిటీని ప్రోత్సహించడమే కంపెనీ లక్ష్యమని వెల్లడించింది.

jio.JPG


ఆఫర్ కింద

ఈ ఆఫర్‌తో అనేక మంది కస్టమర్లు ఉచిత JioAirFiber సబ్‌స్క్రిప్షన్‌ను పొందే అవకాశం ఉంది. అలాగే వినియోగదారులు ఆఫర్ కింద అందుబాటులో ఉన్న కూపన్‌లను నవంబర్ నుంచి అక్టోబర్ 2025 వరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. గత నెల రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఈ దీపావళి నుంచి జియో వినియోగదారులకు 100GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజీని అందించనున్నట్లు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి:

Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 18 , 2024 | 01:13 PM