Share News

Chennai: అయ్యోపాపం.. ఎంతఘోరం.. పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య..

ABN , Publish Date - Jul 12 , 2024 | 11:37 AM

తిరునల్వేలి జిల్లా పనకుడిలో ఓ తండ్రి, కుమారుడు, కుమార్తె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. పనకుడి గ్రామానికి చెందిన రమేష్‌ (41)ఉమ (37) దంపతులకు రాజన్‌ ఎబినేజర్‌ (14) అనే కుమారుడు, కావ్య (10) అనే కుమార్తె ఉన్నారు.

Chennai: అయ్యోపాపం.. ఎంతఘోరం.. పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య..

చెన్నై: తిరునల్వేలి జిల్లా పనకుడిలో ఓ తండ్రి, కుమారుడు, కుమార్తె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. పనకుడి గ్రామానికి చెందిన రమేష్‌ (41)ఉమ (37) దంపతులకు రాజన్‌ ఎబినేజర్‌ (14) అనే కుమారుడు, కావ్య (10) అనే కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో, భర్త మాటలు లెక్కచేయని ఉమ పది రోజుల క్రితం ఒమన్‌ దేశంలో ఉద్యోగానికి వెళ్లిపోయింది. అక్కడి నుంచి భర్తకు ఫోన్‌ చేసిన ఉమ, పిల్లలను తిరుచ్చి(Tiruchi)లో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద అప్పగించాలని కోరడంతో, భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగినట్లు సమాచారం.

ఇదికూడా చదవండి: CBCID: మాజీ మంత్రి అనుచరుడి ఇంట్లో సీబీసీఐడీ సోదాలు..


ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం రమేష్‌ ఇంటి తలుపులు తెరచుకోకపోవడంతో అనుమానించిన చుట్టుపక్కల వారు పనకుడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా, రమేష్‌, కుమారుడు, కుమార్తె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మృతదేహాలను నాగర్‌కోయిల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


ఇదికూడా చదవండి: Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 11:37 AM