Home » Tamil Nadu
రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.
సెల్ఫోన్ యాప్ ద్వారా మహిళలా మాట్లాడి మగవారిని బుట్టలో వేసుకొని నగదు దోచుకున్న ఐదుగురిని గ్రేటర్ చెన్నై పోలీసులు(Greater Chennai Police) అరెస్ట్ చేశారు.
తిరునల్వేలి జిల్లా పాపనాశం సమీపంలో సంచరిస్తున్న చిరుత(Cheetah) బోనులో చిక్కింది. కొద్దిరోజులుగా వెంబయాపురం, తిరుపతియాపురం తదితర గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత... మేకలు, కుక్కలపై దాడి చేస్తోంది.
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పవాయుపీడనం ఏర్పడనుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆ అల్పపీడనం వాయవ్యదిశగా ప్రయాణించి ఈనెల 24న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని తెలిపారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందే డెంగ్యూ జ్వరం(Dengue fever) విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4 వేలమందికి పైగా డెంగ్యూ జ్వర పీడితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలందుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
తమిళనాడు: రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం మధ్య రాష్ట్రానికి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఈనెల 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణం(Kulasekhara town)లో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్ పార్క్’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలో దశాబ్దాలుటా డీఎంకేకు వంతపాడుతుంటే కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చెందగలదని, తెలంగాణా మాజీ గవర్నర్, సౌత్ చెన్నై లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(Dr. Tamilisai Soundararajan) ప్రశ్నించారు.
పదేళ్లపాటు అల్లారు ముద్దుగా పెంచిన శునకం మృతిచెందడంతో దిగులు చెందిన దాని యజమాని ఘనంగా అంత్యక్రియలు జరిపి ఇంటి వద్దే ఖననం చేసి తనకున్న జంతుప్రేమను చాటుకున్నారు. కదిర్ గ్రామం(Kadir village) ప్రాంతానికి చెందిన మది 2014లో డాబర్మేన్ రకానికి చెందిన శునకాన్ని కొనుగోలు చేసి, దానికి రెంబో అని పేరు పెట్టి పెంచాడు.
కేరళలోకి ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు ప్రవేశించనుండటం, బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం నెలకొనటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా స్థానిక వాతావరణ కేంద్ర అధికారులు ఈ నెల 20న మూడు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయంటూ ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్(Red alert)ను, 21వ తేదీ వరకు నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను, తక్కిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.