Home » Chennai News
ఏదైనా ఘటనపై సోషల్ మీడియాలో స్పందించడం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. అసలు విషయం తెలుసుకోకుండా అతిగా స్పందించడం అనార్థాలకు దారితీస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం తమిళనాడులోని కొయ్యంబత్తూరులో జరిగిన ఘటన. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టడంతో పాటు.. తన చిన్నారిపై తల్లికి ప్రేమ లేదనేవిధంగా కామెంట్స్ పెట్టి.. ట్రోల్ చేయడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
సెల్ఫోన్ యాప్ ద్వారా మహిళలా మాట్లాడి మగవారిని బుట్టలో వేసుకొని నగదు దోచుకున్న ఐదుగురిని గ్రేటర్ చెన్నై పోలీసులు(Greater Chennai Police) అరెస్ట్ చేశారు.
తిరునల్వేలి జిల్లా పాపనాశం సమీపంలో సంచరిస్తున్న చిరుత(Cheetah) బోనులో చిక్కింది. కొద్దిరోజులుగా వెంబయాపురం, తిరుపతియాపురం తదితర గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత... మేకలు, కుక్కలపై దాడి చేస్తోంది.
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పవాయుపీడనం ఏర్పడనుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆ అల్పపీడనం వాయవ్యదిశగా ప్రయాణించి ఈనెల 24న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని తెలిపారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందే డెంగ్యూ జ్వరం(Dengue fever) విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4 వేలమందికి పైగా డెంగ్యూ జ్వర పీడితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలందుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన వరుస విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఆ యా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఐసీఐసీఐ(ICICI) ఫైనాన్షియల్ గ్రూప్కు పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ నారాయణన్ వాఘుల్(Narayanan Vaghul) ఈరోజు(మే 18న) కన్నుముశారు. 88 ఏళ్ల వయస్సులో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.
తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణం(Kulasekhara town)లో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్ పార్క్’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలో దశాబ్దాలుటా డీఎంకేకు వంతపాడుతుంటే కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చెందగలదని, తెలంగాణా మాజీ గవర్నర్, సౌత్ చెన్నై లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(Dr. Tamilisai Soundararajan) ప్రశ్నించారు.
పదేళ్లపాటు అల్లారు ముద్దుగా పెంచిన శునకం మృతిచెందడంతో దిగులు చెందిన దాని యజమాని ఘనంగా అంత్యక్రియలు జరిపి ఇంటి వద్దే ఖననం చేసి తనకున్న జంతుప్రేమను చాటుకున్నారు. కదిర్ గ్రామం(Kadir village) ప్రాంతానికి చెందిన మది 2014లో డాబర్మేన్ రకానికి చెందిన శునకాన్ని కొనుగోలు చేసి, దానికి రెంబో అని పేరు పెట్టి పెంచాడు.