Share News

PGECET: రాష్ట్రంలో పీజీఈసెట్ పరీక్షలు వాయిదా..కారణమిదే

ABN , Publish Date - May 17 , 2024 | 06:45 PM

తెలంగాణ(telangana)లో గ్రూప్ 1 ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ పరీక్షల నేపథ్యంలో పీజీఈసెట్(PGECET 2024) ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పీజీఈసెట్ 2024 పరీక్షల షెడ్యూల్ తేదీల్లో మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఏ అరుణ కుమారి ప్రకటించారు.

PGECET: రాష్ట్రంలో పీజీఈసెట్ పరీక్షలు వాయిదా..కారణమిదే
PGECET 2024 exams postponed

తెలంగాణ(telangana)లో గ్రూప్ 1 ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ పరీక్షల(exams) నేపథ్యంలో పీజీఈసెట్(PGECET 2024) ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పీజీఈసెట్ 2024 పరీక్షల షెడ్యూల్ తేదీల్లో మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఏ అరుణ కుమారి ప్రకటించారు. ఈ క్రమంలో జూన్ 6 నుంచి 9 వరకు జరగనున్న పరీక్షలు కొత్తగా జూన్ 10 నుంచి 13 వరకూ నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్ ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమించాలని అధికారులు సూచించారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాలని కోరారు.


ఇవి కూడా చదవండి....

Rakesh Reddy: బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రశ్నించే గొంతును..

AP Elections 2024: ఏపీలో పలువురు అధికారుల బదిలీలు.. కారణమిదే..?

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2024 | 06:51 PM