Share News

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌పై హత్య కేసు

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:18 AM

ప్రముఖ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ క్రీడాకారుడు, ఆల్‌ రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై హత్య కేసు నమోదయింది.

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌పై హత్య కేసు

ఢాకా, ఆగస్టు 23: ప్రముఖ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ క్రీడాకారుడు, ఆల్‌ రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై హత్య కేసు నమోదయింది. ఆయన అవామీ లీగ్‌ పార్టీ మాజీ ఎంపీ కూడా కావడం గమనార్హం. ఈ నెల ఏడో తేదీన ఢాకాలోని రింగ్‌ రోడ్‌ వద్ద జరిగిన అల్లర్లలో తుపాకీ గుళ్లు తగిలి రుబెల్‌ అనే వ్యక్తి మరణించాడు.

ఇందుకు అవామీ లీగ్‌దే బాధ్యత అని పేర్కొంటూ ఆ వ్యక్తి తండ్రి రఫీకల్‌ ఇస్లాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో షకీబ్‌ను 28వ నిందితునిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదే కేసులో ప్రముఖ సినీనటుడు, అవామీలీగ్‌ మాజీ ఎంపీ ఫిర్దౌస్‌ అహ్మద్‌ను 55వ నిందితునిగా పేర్కొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 04:19 AM