Share News

Islamabad : పాకిస్థాన్‌లో పెరిగిన హిందూ జనాభా

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:54 AM

పాకిస్థాన్‌లో హిందువుల జనాభా పెరిగింది. 2017లో 35 లక్షలుగా ఉన్న సంఖ్య 2023లో 38 లక్షలకు పెరిగింది. 2023 జనాభా లెక్కల వివరాలను ప్రముఖ పత్రిక డాన్‌ గురువారం ప్రచురించింది.

Islamabad : పాకిస్థాన్‌లో పెరిగిన హిందూ జనాభా

ఇస్లామాబాద్‌, జూలై 19: పాకిస్థాన్‌లో హిందువుల జనాభా పెరిగింది. 2017లో 35 లక్షలుగా ఉన్న సంఖ్య 2023లో 38 లక్షలకు పెరిగింది. 2023 జనాభా లెక్కల వివరాలను ప్రముఖ పత్రిక డాన్‌ గురువారం ప్రచురించింది. దాని ప్రకారం పాకిస్థాన్‌ మొత్తం జనాభా సుమారు 24.4 కోట్లు. 2017తో పొలిస్తే 2023లో మైనార్టీల సంఖ్య పెరగడం గమనార్హం. క్రైస్తవులు 26 లక్షల నుంచి 33 లక్షలకు పెరిగారు. కాగా, మొత్తం జనాభాతో పోలిస్తే ఆరేళ్లలో హిందువులు 1.73 శాతం నుంచి 1.63 శాతానికి స్వల్పంగా తగ్గిపోగా, క్రైస్తవులు 1.27 నుంచి 1.37 శాతానికి పెరగడం విశేషం.

Updated Date - Jul 20 , 2024 | 04:54 AM