Share News

Kolkata Doctor: కోల్‌కతా డాక్టర్ కేసుపై ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ లేఖ.. స్పందించిన బెంగాల్ గవర్నర్

ABN , Publish Date - Aug 19 , 2024 | 11:44 AM

కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో ఆగస్టు 9న మహిళా వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ విషాద ఘటన విషయంలో మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ రాసిన గవర్నర్‌కు బహిరంగ లేఖ రాశారు.

Kolkata Doctor: కోల్‌కతా డాక్టర్ కేసుపై ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ లేఖ.. స్పందించిన బెంగాల్ గవర్నర్
Bengal Governor responded to AAP MP Harbhajan Singh

కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో ఆగస్టు 9న మహిళా వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ విషాద ఘటన విషయంలో మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ రాసిన గవర్నర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ కేసు విషయంలో ఏం చర్యలు తీసుకున్నారని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాష్ట్రంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయంలో తీసుకున్న చర్యల గురించి తెలియజేయడానికి, ఈ విషయంలో వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి గవర్నర్ అత్యవసరంగా సమావేశమయ్యారు.


బాధితులకు

ఆసుపత్రులలో భద్రతా ప్రోటోకాల్‌లను బలోపేతం చేయడం, హింసాత్మక బాధితులకు తగిన సహాయాన్ని అందించడం వంటి చర్యలు తీసుకోవాలని హర్భజన్ సింగ్(Harbhajan Singh) లేఖలో కోరారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులందరికీ సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించాలన్నారు. సురక్షితమైన పని వాతావరణాన్ని కోరుతూ సమ్మె చేస్తున్న వైద్యులకు రాజకీయవేత్తగా మారిన హర్భజన్ సింగ్ మద్దతు తెలిపారు. వైద్య సంఘం ఇప్పటికే సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో పని చేస్తుందని ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి భద్రత కూడా చాలా ముఖ్యమన్నారు. భయాందోళనల నేపథ్యంలో వారు పనిచేస్తున్నప్పుడు అంకితభావంతో తమ విధులను ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నించారు.


రాజీపడే ప్రసక్తే

ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్‌కు తీసుకున్న, తీసుకోవలసిన చర్యల గురించి గవర్నర్ వివరించనున్నారు. ఈ నేపథ్యంలో మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని గవర్నర్ అన్నారు. నేరస్తులకు చట్టపరంగా పూర్తి శిక్ష విధించి కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి స్త్రీ సురక్షితంగా, రక్షణగా భావించే సమాజాన్ని మేము సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీవీ ఆనంద్ బోస్ మధ్య విబేధాలు ఉన్న నేపథ్యంలోనే ఈ కేసు విచారణ ఆలస్యమవుతుందని పలువురు విమర్శలు చేస్తున్నారు.


ఆగస్టు 9న దారుణం

ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశారు. మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్‌లో ఈ ఘటన అర్థరాత్రి జరిగింది. ఆ సమయంలో ఆమె శరీరంపై చాలా చోట్ల గాయాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన విషయంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. దీంతోపాటు ఇతరుల ప్రమేయం కూడా ఉందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు తరలించాలని ఆదేశించారు. అవసరమైతే నిందితులకు మరణశిక్ష విధిస్తామని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Supreme Court : కోల్‌కతా హత్యాచారంపై సుప్రీంకోర్టు విచారణ


TMC : టీఎంసీలో చిచ్చు!


Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 19 , 2024 | 11:46 AM