Share News

CM Pushkar Singh Dhami: కార్గిల్ విజయ్ దివస్ వేళ ఉత్తరాఖండ్ ‘అగ్నివీరులకు’ గిఫ్ట్

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:54 PM

కార్గిల్ దివస్ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ప్రకటించారు. సైన్యంలో విధులు నిర్వహించిన అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన అగ్ని వీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

CM Pushkar Singh Dhami: కార్గిల్ విజయ్ దివస్ వేళ ఉత్తరాఖండ్ ‘అగ్నివీరులకు’ గిఫ్ట్
Uttarakhand Cheif Minister Pushkar Dhami

డెహ్రడూన్, జులై 26: కార్గిల్ దివస్ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ప్రకటించారు. సైన్యంలో విధులు నిర్వహించిన అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన అగ్ని వీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఈ యుద్దంలో మరణించిన అమర వీరులకు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జులై 26వ తేదీతో.. అంటే నేటికి కార్గిల్ యుద్దం ముగిసి 25 ఏళ్లు అయింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Delhi excise case: మనీష్‌తోపాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు


అమరవీరుల కుటుంబాలకు అందించే సాయాన్ని పెంచుతాం...

ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, రిజర్వేషన్లను పొడిగించేందుకు చట్టం తీసుకువస్తామని ఈ సందర్భంగా ధామి హామీ ఇచ్చారు. వారికి ప్రభుత్వ సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేలా నిబంధనలు రూపొందించి చట్టం తీసుకు వస్తామన్నారు. అందుకు సంబంధించి.. ప్రణాళిక సిద్దం చేసేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో అగ్నివీరుల నైపుణ్యాలు, క్రమశిక్షణను వినియోగించుకుంటామని చెప్పారు. అయితే అమరవీరుల కుటుంబాలకు అందించే సాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచుతామని ఈ సందర్భంగా సీఎం ధామి ప్రకటించారు.

Also Read: High alert in Jammu: ఆర్మీ స్కూల్స్ మూసివేత.. ఎందుకంటే..?


abv.jpg

ఏ త్యాగము పెద్దది కాదు..

'దేశ సరిహద్దుల భద్రత కోసం ప్రాణాలర్పించడం కంటే ఏ త్యాగమూ పెద్దది కాదని ఆయన పేర్కొన్నారు. ఈ అత్యున్నత త్యాగానికి దేనితోను సరి తూచలేమన్నారు. యుద్ధంలో విజయం సాధించామంటే.. అందులో రాజకీయ నాయకత్వ సామర్థ్యంపైన సైతం ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నాటి కార్గిల్ యుద్దంలో భారత్ విజయం సాధించిందంటే.. ఆ ఘనత నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ కూడా చెందుతుందన్నారు. ఇక ప్రధాని మోదీ నాయకత్వంలో సైతం భారత్ సైనిక బలం భారీగా పెరిగిందన్నారు. అంతేకాదు.. మోదీ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాలు ఎలా పురోగామి దిశాగా వెళ్తున్న విషయాన్ని ఈ సందర్బంగా సోదాహరణగా సీఎం ధామి వివరించారు.

Also Read: Maharashtra: ‘గ్యాంగ్‌స్టర్’ కొంప ముంచిన ఫ్యాన్స్ అత్యుత్సాహం


ప్రతిపక్షాలకు మోదీ చురకలు..

మరోవైపు అగ్నిపథ్ పథకంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలకు కార్గిల్ దివస్ వేళ.. ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. ఈ పథకంపై వారి విమర్శలను ఆయన ఖండించారు. అంతేకాదు.. ఆర్మీలో సంస్కరణల్లో భాగంగా ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్లు చెప్పారు. దేశ సైన్యంలో యువ రక్తంతోపాటు నిత్యం యుద్దానికి సన్నద్ధతతో ఉండేందుకే ఈ పథకాన్ని రూపొందాంచామన్నారు.

Also Read: Kargil Vijay Diwas 2024: అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల విమర్శలు.. తిప్పికొట్టిన ప్రధాని మోదీ.. పథకం ఉద్దేశం ఇది..

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 05:55 PM