Share News

టపాసులతో కేజ్రీకి స్వాగతం.. కేసు నమోదు

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:58 AM

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఆయన అభిమానులు టపాసులు కాల్చి స్వాగతం పలికారు.

టపాసులతో కేజ్రీకి స్వాగతం.. కేసు నమోదు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఆయన అభిమానులు టపాసులు కాల్చి స్వాగతం పలికారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై శనివారం కేసు నమోదు చేశారు. న్యూఢిల్లీలో టపాసుల తయారీ, వినియోగం, అమ్మకంపై నిషేధం ఉండడమే ఇందుకు కారణం. వాయు కాలుష్యం నియంత్రణకు తోడు రాబోయే శీతాకాలం నేపథ్యంలో టపాసులపై నిషేధం విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సోమవారమే ప్రకటన చేసింది.

Updated Date - Sep 15 , 2024 | 03:58 AM