Share News

Karnataka: డీకే శివకుమార్‌ నకిలీ ఫొటోలు వైరల్‌

ABN , Publish Date - May 06 , 2024 | 04:06 AM

కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ నకిలీ ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిపై హైగ్రౌండ్‌ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Karnataka: డీకే శివకుమార్‌ నకిలీ ఫొటోలు వైరల్‌

బెంగళూరు, మే 5(ఆంధ్రజ్యోతి): కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ నకిలీ ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిపై హైగ్రౌండ్‌ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

డీకే శివకుమార్‌ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారని కాంగ్రెస్‌ నాయకుడు హరీశ్‌ నాగరాజ్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సంతోష్‌ (నెలమంగల), రాజేశ్‌గౌడ (కేసరి సామ్రాట్‌) పేర్లతో ఉండే సోషల్‌ మీడియా ఖాతాద్వారా నకిలీ ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

Updated Date - May 06 , 2024 | 04:06 AM