Home » Karnataka
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామనగర జిల్లా జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చాలనే ఆలోచనకు మంత్రివర్గం శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. రామనగర ప్రజల డిమాండ్లను పరిశీలించి ఆ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renukaswamy) హత్యకేసులో జైలుపాలైన నటుడు దర్శన్(Actor Darshan)కు పరప్పన అగ్రహార జైలు(Parappana Agrahara Jail) భోజనమే కొనసాగుతుంది. ఇంటి భోజనం, పరుపు, దుస్తులు కోరుతూ దర్శన్ దాఖలు చేసుకున్న పిటీషన్ను 24వ ఏసీఎంఎం కోర్టు కొట్టివేసింది. జైలు భోజనంతో అజీర్ణం, అతిసార అవుతోందని, శరీరం బరువు తగ్గుతున్నానని కారణాలు చూపుతూ ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని దర్శన్ తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేసుకున్నారు.
తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాట, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రైతుల జీవనాడి నిండుకుండలా తొణికిసలాడుతోంది. డ్యాం పైప్రాంతం నుంచి జలాశయంలోకి ఇన్ఫ్లో 80 వేలకు పైగా క్యూసెక్కులుగా నమోదయ్యింది.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు పని సమయం 14 గంటలకు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై టెకీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా వారు నిరసన తెలుపుతున్నారు.
ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికై దేశవ్యాప్తంగా నిర్వహించే అర్హతా పరీక్షలు ‘నీట్’ను కర్ణాటకలో రద్దు చేసేందుకు శాసనసభ ఉభయసభలు తీర్మానించాయి.
తుంగభద్ర జలాశయానికి(Tungabhadra Reservoir) వరద పెరుగుతోంది. పై ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న తుంగ, భద్ర నదులు(Tunga and Bhadra rivers) ఉప్పొంగి తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి పెరుగుతోంది.
ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు విస్తరిస్తున్న బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP))ను పాలనా సౌలభ్యాల కోసం విభజించాలనే ప్రక్రియకు తుదిరూపు దిద్దారు. గతంలో 3 లేదా 5 భాగాలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఏకంగా మూడు విడతల పాలనా వ్యవస్థ, గరిష్టంగా 10 పాలికెలను అనుసంధానం చేసుకుని గ్రేటర్ బెంగళూరు పాలనా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వారాణసిలో గంగా హారతి తరహాలోనే కావేరి నదికి కావేరి హారతి నిర్వహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) తెలిపారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకాలోని కేఆర్ఎస్ జలాశయాన్ని డీకే సందర్శించారు.
తుంగభద్ర(Tungabhadra)కు వరదపోటు ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం జలాశయానికి చెందిన 15,16,17 క్రస్ట్గేట్ల గుండా 4వేల కూసెక్కుల నీటిని నదికి వదిలారు.
కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో ఉద్యోగాల రిజర్వేషన్ అంశానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఫోన్ పే సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ సమీర్ నిగమ్ క్షమాపణ చెప్పారు.