Share News

Army Drone: సాంకేతిక లోపంతో పాక్‌ భూభాగంలోకి భారత నిఘా డ్రోన్

ABN , Publish Date - Aug 23 , 2024 | 09:21 PM

సరిహద్దుల్లో నిఘా కోసం వినియోగించే ఒక డ్రోన్ సాంకేతిక లోపం కారణంగా అదుపుతప్పి పాకిస్థాన్‌లో శుక్రవారం ల్యాండ్ అయింది. మానవ రహిత డ్రోన్ ట్రైనింగ్ మిషన్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు భారత ఆర్మీ తెలిపింది.

Army Drone: సాంకేతిక లోపంతో పాక్‌ భూభాగంలోకి భారత నిఘా డ్రోన్

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నిఘా కోసం వినియోగించే ఒక డ్రోన్ సాంకేతిక లోపం కారణంగా అదుపుతప్పి పాకిస్థాన్‌లో శుక్రవారం ల్యాండ్ అయింది. మానవ రహిత డ్రోన్ ట్రైనింగ్ మిషన్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు భారత ఆర్మీ తెలిపింది.


''ఉదయం 9.25 గంటలకు భారత భూభాగంలోని నిఘా డ్రోన్ అదుపుతప్పి పాక్ భూభాగంలోకి ప్రవేశించింది. మీడియా సమాచారం ప్రకారం డ్రోన్‌ను పాక్ స్వాధీనం చేసుకుంది. హాట్ లైన్ ద్వారా పాక్ ఆర్మీకి సమాచారం ఇచ్చాం. యూఏవీని వెనక్కి ఇవ్వాలని కోరాం'' అని ఇండియన్ ఆర్మీ తెలిపింది.

Kolkata rape-murder case: మమతకు ఝలక్.. ఫెస్టివల్ గ్రాంట్‌‌ను తోసిపుచ్చిన దుర్గా పూజా కమిటీలు


దీనికి ముందు, ఈనెల 10న రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్ జిల్లాలోని భారత్-పాక్ సరిహద్దు గ్రామంలో పాక్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఇందులోని రూ.15 కోట్లు విలువచేసే 3 కిలోల హెరాయిన్‌ను సైతం స్వాధీనం చేసుకుంది. స్మగ్లింగు ప్రయత్నంలో ఉండగా సాంకేతక లోపం వల్ల డ్రోన్ కూలిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఒక పొలంలో డ్రోన్ కూలిపోయిన సమాచారం మేరకు పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 23 , 2024 | 09:21 PM