Share News

భారత్‌తో ఒప్పందాలపై మాల్దీవుల దర్యాప్తు

ABN , Publish Date - Jun 12 , 2024 | 04:17 AM

భారత్‌ విషయంలో మాల్దీవుల తీరు మారడం లేదు. గత ప్రభుత్వం భారత్‌తో చేసుకున్న కొన్ని ఒప్పందాలపై మాల్దీవుల పార్లమెంట్‌ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జు భారత్‌

భారత్‌తో ఒప్పందాలపై మాల్దీవుల దర్యాప్తు

న్యూఢిల్లీ, జూన్‌ 11 : భారత్‌ విషయంలో మాల్దీవుల తీరు మారడం లేదు. గత ప్రభుత్వం భారత్‌తో చేసుకున్న కొన్ని ఒప్పందాలపై మాల్దీవుల పార్లమెంట్‌ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జు భారత్‌ పర్యటనలో ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నేవీ బేస్‌ల అభివృద్ధికి సంబంధించి మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలీహ్‌ ప్రభుత్వం భారత్‌తో చేసుకున్న మూడు ఒప్పందాలు మాల్దీవుల సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉండడంతో దర్యాప్తు చేపట్టామని మాల్దీవుల పార్లమెంటరీ కమిటీ ప్రకటించింది. ఈ అంశంపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

Updated Date - Jun 12 , 2024 | 04:17 AM