Share News

Mamata : 1న ‘ఇండియా’ నేతల భేటీ.. మమత దూరం

ABN , Publish Date - May 28 , 2024 | 06:03 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహం ఖరారుకు ‘ఇండియా’ కూటమి అగ్ర నేతలు జూన్‌ 1న సమావేశం కానున్నారు. ఆ రోజు తుది దశ పోలింగ్‌

Mamata : 1న ‘ఇండియా’ నేతల భేటీ.. మమత దూరం

న్యూఢిల్లీ, మే 27: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహం ఖరారుకు ‘ఇండియా’ కూటమి అగ్ర నేతలు జూన్‌ 1న సమావేశం కానున్నారు. ఆ రోజు తుది దశ పోలింగ్‌ జరుగుతుండగానే ఢిల్లీలో మధ్నాహ్నం వీరు భేటీ అవుతారు. అయితే దీనికి తాను హాజరు కాలేనని టీఎంసీ నాయకురాలు మమత ప్రకటించారు. రాష్ట్రంలో ఓ పక్క ఎన్నికలు, మరోపక్క తుఫాను సాయం అందించాల్సి ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లగలనని సోమవారం కోల్‌కతాలో ఓ ర్యాలీలో అన్నారు. బెంగాల్లో మిగిలిన 9 లోక్‌సభ స్థానాలకు 1న పోలింగ్‌ జరుగనుంది.

Updated Date - May 28 , 2024 | 06:03 AM