Share News

BJP: మైనారిటీలో హరియాణా బీజేపీ ప్రభుత్వం!

ABN , Publish Date - May 08 , 2024 | 10:25 AM

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హరియాణాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఎమ్మెల్యేలు సోంబీర్‌ సంగ్వాన్‌, రణధీర్‌ గొల్లెన్‌, ధరంపాల్‌ గొండెర్‌లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.

BJP: మైనారిటీలో హరియాణా బీజేపీ ప్రభుత్వం!

ఛండీగఢ్‌, మే 7: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హరియాణాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఎమ్మెల్యేలు సోంబీర్‌ సంగ్వాన్‌, రణధీర్‌ గొల్లెన్‌, ధరంపాల్‌ గొండెర్‌లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.

‘‘ప్రభుత్వానికి మా మద్దతును ఉపసంహరించుకుంటున్నాం. కాంగ్రెస్‌కు మా మద్దతును తెలుపుతున్నాం. రైతుల సమస్యతో పాటు, ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ప్రకటించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్‌సింగ్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఉదయ్‌ భాన్‌ డిమాండ్‌ చేశారు. త్వరల్లోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు.

Updated Date - May 08 , 2024 | 10:25 AM