Share News

National : తమిళనాడులో కల్తీసారాకు 13 మంది బలి

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:55 AM

తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 13 మంది మృతి చెందారు. మరో 60 మంది అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

National : తమిళనాడులో కల్తీసారాకు 13 మంది బలి

చెన్నై, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 13 మంది మృతి చెందారు. మరో 60 మంది అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మంగళవారం రాత్రి సుమారు 75 మంది కల్తీసారా తాగారు. బుధవారం వేకువజామున వీరంతా వాంతులు, విరేచనాలు, కడుపులో మంటతో బాధపడుతుండటంతో కుటుంబీకులు వారిని ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ 13 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళ కూడా ఉన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 07:33 AM