Share News

Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై నేడు సుప్రీం తుది తీర్పు..

ABN , Publish Date - Jul 12 , 2024 | 10:18 AM

ఢిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్‌పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇవ్వనుంది. మద్యం విధానం కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కేజ్రీవాల్ సవాలు చేశారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై నేడు సుప్రీం తుది తీర్పు..

ఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్‌పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇవ్వనుంది. మద్యం విధానం కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కేజ్రీవాల్ (Kejriwal) సవాలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపింది. కేజ్రీవాల్, ఈడీ వాదనల అనంతరం మే 17న తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఆ తరవాత జూన్ 20న కేజ్రీవాల్‌కి రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేయగా... మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది.


రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఆదేశాలపై గత నెల 25న స్టే ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. ఆ తర్వాత అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. గత నెల 27న కేజ్రీవాల్ ని అరెస్టు చేసి.. రౌస్ అవెన్యూ కోర్టు ముందు దర్యాప్తు సంస్థ హాజరుపరిచింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఇంతకుముందే కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్టు చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టుతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేజ్రీవాల్ జైలులోనే ఉన్నారు.

Arakuloya : బొర్రా గుహలకు ముప్పు!

Updated Date - Jul 12 , 2024 | 10:18 AM