Medaram: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్ రెడ్డి

ABN, Publish Date - Feb 23 , 2024 | 12:38 PM

ములుగు జిల్లా: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మేడారం జాతరకు విచ్చేశారు. ఇక్కడ కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. ఇక, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం టెంపరరీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని, ఇది అమ్మవార్ల దయగానే భావిస్తామని తెలిపారు. ఈ ట్రైబల్ వర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉంటుందని కిషన్ రెడ్డి వివరించారు.

Medaram: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్ రెడ్డి 1/6

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మేడారం జాతరకు విచ్చేశారు. ఇక్కడ కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యం..

Medaram: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్ రెడ్డి 2/6

తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మేడారం జాతరలో వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తున్న దృశ్యం. ప్రక్కన మంత్రి సీతక్కను చూడవచ్చు.

Medaram: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్ రెడ్డి 3/6

రాష్ట్ర మంత్రి సీతక్క.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సమ్మక్క-సారలమ్మల మెమెంటో సమర్పిస్తున్న దృశ్యం.

Medaram: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్ రెడ్డి 4/6

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించిన దృశ్యం.. ప్రక్కన మంత్రి సీతక్కను చూడవచ్చు.

Medaram: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్ రెడ్డి 5/6

మేడారం సమక్క - సారమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యం.

Medaram: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్ రెడ్డి 6/6

మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క..

Updated at - Feb 23 , 2024 | 12:38 PM