Share News

MLA Raghu Rama: ఆర్ఆర్ఆర్‌ను చూసి ‘జై జగన్’ అంటూ నినాదాలు.. ఈ రియాక్షన్ ఊహించి ఉండరేమో..!

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:43 PM

రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishna Raju) .. ఈయన వైసీపీకి (YSRCP) అస్సలు పడని మనిషి..! అలాంటిది ఈయన వైసీపీ కార్యకర్తల కంట పడితే.. ఇక వాళ్ల ఓవరాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..! పోనీ ఆ ఓవరాక్షన్‌కు..

MLA Raghu Rama: ఆర్ఆర్ఆర్‌ను చూసి ‘జై జగన్’ అంటూ నినాదాలు.. ఈ రియాక్షన్ ఊహించి ఉండరేమో..!

రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishna Raju) .. ఈయన వైసీపీకి (YSRCP) అస్సలు పడని మనిషి..! అలాంటిది ఈయన వైసీపీ కార్యకర్తల కంట పడితే.. ఇక వాళ్ల ఓవరాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..! పోనీ ఆ ఓవరాక్షన్‌కు రఘురామ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో కూడా ఊహించుకోండి..! నిజంగా గట్టిగానే ఇచ్చి పడేసి ఉంటారు.. ఇక జీవితంలో ఈయన్ను చూసి నినాదాలు, ఓవర్ చేయకుండా అని అనుకుంటున్నారు కదా..! అస్సలు కానే కాదండోయ్.. రఘురామ నుంచి రియాక్షన్ మరోలా వచ్చింది. బహుశా ఇలాంటి రియాక్షన్‌ను ఊహించి ఉండరేమో..! రండి ఏం జరిగిందో తెలుసుకుందాం..!


Raghu-Rama.jpg

నాడు ఎంపీగా.. నేడు ఎమ్మెల్యేగా!

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణ రాజు.. ఆ తర్వాత పార్టీ అధినేత తీరు నచ్చక రెబల్‌గా మారాల్సి వచ్చింది. నాటి నుంచి నేటి వరకూ వైసీపీ, వైఎస్ జగన్ రెడ్డిని ఎన్నిసార్లు విమర్శించి ఉంటారో.. వైసీపీ తప్పులను ఏ రేంజిలో తూర్పారబట్టారో మనందరూ మీడియాలో చూశాం. 2024 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈయన అస్సలు గెలవరని కొందరు.. భారీ మెజార్టీతో గెలుస్తారని ఇంకొందరు పెద్ద ఎత్తునే బెట్టింగ్స్ కూడా నడిచాయి. అనుకున్నట్లే మంచి మెజార్టీతో గెలిచారు.. అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టారు.

Raghu-Rama-2.jpg

ఇదీ అసలు సంగతి..!

ఇప్పుడిక టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో ఆయన్ను చూసిన వైసీపీ కార్యకర్తలు, వైఎస్ జగన్ వీరాభిమానులు ‘జై జగన్..’ ‘జైజై జగన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన సైలెంట్‌గా ఉండే కొద్దీ మరింత స్వరం పెంచి నినాదాలతో హడావుడి చేశారు. అయితే.. రఘురామ మాత్రం ఎక్కడా కోపగించుకోకుండా.. మారుమాట కూడా మాట్లాడకుండా లైట్ తీస్కోని నవ్వుకుంటూ కాన్వాయ్ దగ్గరికి వెళ్లిపోయారు. అక్కడ్నుంచి రఘురామ భీమవరం బయల్దేరి వెళ్లారు.


Raghu-Rama-1.jpg

ఇంత మార్పా..?

ఈ నినాదాలు.. రఘురామ రియాక్షన్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పనిగట్టుకుని మరీ వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు కామెంట్స్ చేస్తూ.. పోస్టులు పెడుతున్నారు. అయితే.. కామెంట్స్ మాత్రం చాలా విచిత్రంగా వస్తున్నాయి. ఎలాగంటే.. వైసీపీ వాళ్లు ఇంత పైత్యం ప్రదర్శించి రెచ్చగొడుతున్నా రఘురామ సైలెంట్‌గా ఉన్నారేంటి..? అని కొందరు నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా మీరు మారిపోయారు సార్..’ అని మరికొందరు రఘురామ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే అసలు ఈయన ‘ఆర్ఆర్ఆర్ ఆ.. కాదా’ అని సందేహాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లోనే చాకచక్యంగా వ్యవహరించారని.. రఘురామ మరో మాట ఏదైనా అంటే.. అది ఇంకాస్త పెరిగి అంత రచ్చ అక్కర్లేదనే ఇలా నవ్వేసి తన దారిన తాను వెళ్లిపోయారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

వైఎస్ జగన్ రాజీనామా..!?


మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..


Updated Date - Jul 08 , 2024 | 01:46 PM