Share News

Viral Video: వైరల్ కావాలనే పిచ్చి.. అమ్మాయిని చూస్తూ, బారికేడ్‌ను ఢీకొట్టారు

ABN , Publish Date - Sep 16 , 2024 | 04:18 PM

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత చేయని జిమ్మిక్కులు అంటూ లేవు. పబ్లిసిటీ పిచ్చిలో స్టంట్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

Viral Video: వైరల్ కావాలనే పిచ్చి.. అమ్మాయిని చూస్తూ, బారికేడ్‌ను ఢీకొట్టారు

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత చేయని జిమ్మిక్కులు అంటూ లేవు. పబ్లిసిటీ పిచ్చిలో స్టంట్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. కానీ.. స్టంట్స్ చేస్తున్న క్రమంలో కొన్ని సార్లు వారి ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. వాటిల్లో కొన్ని వీడియోలు మనపై ప్రభావాన్ని చూపుతున్నాయి. అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సాధారణంగానే అమ్మాయిలు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే.. కుర్రకారు మైమరచిపోతుంటారు.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుంటాడు. బైక్ నడుపుతుండగా.. వారి పక్క నుంచి ఓ అమ్మాయి నడుస్తూ వస్తుంది. స్నేహితులిద్దరూ ఆమెను చూస్తూ లోకాన్ని మర్చిపోతారు. అలా ఎదురుగా బారికేడ్లు ఉన్న విషయాన్ని గుర్తించరు. చివరికి అమ్మాయిని చూస్తూ.. బారికేడ్లను ఢీ కొంటారు.


సంఘటన మొత్తాన్ని మరొకరు వీడియో తీశారు. ఇదంతా చూస్తుంటే సినిమాలో చూసే వినోదభరితంగా సీన్‌లా అనిపించినప్పటికీ.. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. వీడియో వైరల్ కావడం కోసం కావాలనే చేసిన పనిలా అనిపిస్తోంది. సోషల్ మీడియా పిచ్చిలో యువత ఇలాంటి రిస్కీ స్టంట్లూ చేస్తుండటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరో ఘటనలో..

ఢిల్లీలోని వికాస్ ‌పూరి ఫ్లైఓవర్ పై ఒక జంట చేసిన పాడు పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
ఫ్లైఓవర్ మీద ఈ జంట కదులుతున్న బైక్‌పై ముద్దులు పెట్టుకోసాగింది. చుట్టూ ఉన్న వారు ఏమనుకుంటారనే ఇంగితం మరిచిపోయి రోడ్డుపై బరితెగించారు. ట్రాఫిక్ నిబంధనలు కూడా పట్టించుకోకుండా వేగంగా వెళ్తు వాహనదారులను భయందోళనకు గురి చేశారు. ఈ దృశ్యాలను ఓ వాహనదారుడు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో పోలీసులు వారిని వెతికిపట్టుకునే పనిలో పడ్డారు. వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - Sep 16 , 2024 | 04:33 PM