Share News

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌ షూటింగ్‌లో స్వర్ణం, కాంస్యం గెలిచిన భారత్

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:14 PM

పారిస్ పారాలింపిక్స్‌లో దేశానికి తొలి బంగారు పతకం లభించింది. 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అవనీ దేశం అంచనాలను అందుకుంది.

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌ షూటింగ్‌లో స్వర్ణం, కాంస్యం గెలిచిన భారత్
paris Paralympics 2024 india

పారిస్ పారాలింపిక్స్ 2024(paris paralympics 2024 )లో భారత స్టార్ పారా షూటర్ అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పారాలింపిక్స్‌లో అవనీ వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH 1) విభాగంలో అవని మొదటి స్థానంలో నిలవగా, ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మరో పారా షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఫైనల్‌లో మోనా 228.7 స్కోరుతో కాంస్య పతకాన్ని గెలుచుకోగా, ఫైనల్‌లో అవనీ 249.7 స్కోర్ చేసింది. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో కూడా అవనీ బంగారు పతకం సాధించింది.


దీంతో పారిస్ పారాలింపిక్స్ రెండో రోజున భారత్‌కు రెండు పతకాలు లభించాయి. మహిళా షూటర్లు భారత్ పతక ఖాతా తెరిచారు. టోక్యో పారాలింపిక్ పతక విజేత అవనీ లేఖా కూడా పారిస్‌లో పారాలింపిక్ రికార్డుతో స్వర్ణం సాధించగా, భారతదేశం రెండవ షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.


ప్రమాదం నుంచి

అవనీ లేఖరాకు ఫిబ్రవరి 20, 2012 ఎప్పటికీ గుర్తుంచుకునే తేదీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె కుటుంబం జైపూర్ నుంచి రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌కు వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. ఆ క్రమంలో ఆమె వెన్నుముఖ దెబ్బతింది. దీంతో ఆమె నడుము భాగం పక్షవాతానికి గురైంది. అప్పటి 10 ఏళ్ల బాలిక ప్రమాదం జరిగిన తర్వాత రెండేళ్లపాటు ఇంట్లోనే ఉంది. ఆ సమయంలో ఆమె ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ప్రమాదం తర్వాత అవనీ మొదట ఎలా కూర్చోవాలో నేర్చుకుంది. ఆ తర్వాత వీల్ చైర్‌పై పాఠశాలకు వెళ్లడం ప్రారంభించి విద్యను అభ్యసించింది.


తండ్రి ప్రోత్సాహం

ఆ నేపథ్యంలో ఆమె తండ్రి ప్రవీణ్ ఆమెను షూటింగ్‌కి పరిచయం చేశాడు. కానీ లేఖరా ఆ క్రీడపై ఎంతో ఆసక్తి పెంచుకుని అనేక సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చింది. అప్పుడే ఆమె అభినవ్ బింద్రా ఆత్మకథ ఎ షాట్ ఎట్ హిస్టరీ మై అబ్సెసివ్ జర్నీ టు ఒలింపిక్ గోల్డ్‌ పుస్తకాన్ని చదివింది. భారతదేశం మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతక విజేత నుంచి ప్రేరణ పొందింది. వెనుక వీపుకు తీవ్రమైన గాయం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో అవనీ వీల్‌చైర్‌ను ఉపయోగించి షూటింగ్‌లో SH1 విభాగంలో పాల్గొంది. దీనిలో చేతులు, దిగువ మొండెం, కాళ్ల కదలికలు ప్రభావితం అయిన వారు ఉంటారు.


ఇవి కూడా చదవండి:

Vistara: ప్రయాణికులకు అలర్ట్.. ఈ విమాన టిక్కెట్స్ బుకింగ్ బంద్


Narendra Modi: గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కరెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు


Personal Loan: పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారా.. ఈ ఛార్జీల విషయంలో జాగ్రత్త

Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం


Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 04:35 PM