Share News

Babitha Phogat: రూ. 2వేల కోట్ల సినిమా తీసి కోటి ఇచ్చారు.. ’దంగల్‘ టీంపై బబిత కామెంట్స్

ABN , Publish Date - Oct 23 , 2024 | 03:56 PM

తమ కథను ఆధారం చేసుకుని వేల కోట్ల బిజినెస్ చేసుకున్న సినిమా టీం తమ కుటుంబం డబ్బులు సాయం అడిగినప్పుడు స్పందించకపోడం బాధకలిగించిందని మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్ ఆవేదన వ్యక్తం చేసింది.

Babitha Phogat: రూ. 2వేల కోట్ల సినిమా తీసి కోటి ఇచ్చారు.. ’దంగల్‘ టీంపై బబిత కామెంట్స్
Babitha Phogat

ఢిల్లీ: భారత మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్ దంగల్ మూవీ టీంపై సంచలన ఆరోపణలు చేశారు. వీరి కుటుంబం ఆధారంగానే బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి దంగల్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అమిర్ ఖాన్ వంటి స్టార్ క్యాస్ట్ తో తీసిన దంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ఏకంగా 2 వేల కోట్లు కలెక్ట్ చేసింది. తాజాగా ఈ సినిమాపై బబితా ఫొగాట్ మాట్లాడుతూ.. మూవీ టీం తమకు కేవలం రూ. కోటి మాత్రమే ఇచ్చినట్టుగా తెలిపింది.


తమ కథను ఆధారం చేసుకుని వేల కోట్ల బిజినెస్ చేసి కేవలం మీకు కోటి రూపాయలు ఇవ్వడం బాధ కలిగించలేదా అని ఓ జర్నలిస్ట్ ఆమెను ప్రశ్నించగా.. లేదు.. సమాజం నుంచి మనం ప్రేమ, గౌరవాన్ని మాత్రమే ఆశించాలి అని మా నాన్న చెప్పారు అని బబిత తెలిపింది. అయితే, తమ సొంత గ్రామంలో అకాడమీ ఏర్పాటుకు డబ్బుల్లేక మూవీ టీంను సాయం అడిగితే వారు సమాధానం ఇవ్వకపోవడం బాధనిపించినట్టు తెలిపింది. అకాడమీ నిర్మాణానికి దాదాపు రూ. 5 కోట్లు ఖర్చవుతుందని వివరించింది.


2016లో విడుదలైన దంగల్ సినిమా బబితా ఆమె అక్క గీతా ఫొగాట్ వారి తండ్రి మహవీర్ ఫొగాట్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. కుమార్తెలను మేటి రెజ్లర్లుగా తీర్చిదిద్దడానికి మహవీర్ చేసిన పోరాటం చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. బబిత 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 2014లో స్వర్ణం సంపాదించి మరింత కీర్తిపొందింది. 2019లో బబిత రెజ్లింగ్ ను వీడి రాజకీయాలవైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే.

Virat Kohli: స్టేడియం దద్దరిల్లింది.. పాక్ టీవీలు పగిలాయి..

Updated Date - Oct 23 , 2024 | 05:57 PM