Share News

MI vs LSG: పూరన్ విధ్వంసం.. ముంబై ముందు భారీ టార్గెట్

ABN , Publish Date - May 17 , 2024 | 09:52 PM

ఐపీఎల్-2024లో (IPL 2024) తమ చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి చెలరేగాడు.

MI vs LSG: పూరన్ విధ్వంసం.. ముంబై ముందు భారీ టార్గెట్
Nicholas Pooran

ముంబై: ఐపీఎల్-2024లో (IPL 2024) తమ చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి చెలరేగాడు. ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతులు ఆడి 75 పరుగులు బాదాడు. ఇందులో ఏకంగా 8 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.


ఇతర బ్యాటర్ల విషయానికి వస్తే ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ కూడా 55 పరుగులతో రాణించాడు. ఇక దేవదూత్ పడిక్కల్ (0), మార్కస్ స్టోయినిస్ (28), దీపక్ హుడా (11), అర్షద్ ఖాన్ (0), ఆయుశ్ బదోని (22 నాటౌట్), కృనాల్ పాండ్యా (12 నాటౌట్) చొప్పున పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో ఎన్ తుషార, చావ్లా చెరో 3 వికెట్లు తీశారు.

Updated Date - May 17 , 2024 | 09:52 PM