Share News

Hyderabad Match: మళ్లీ ఉప్పల్‌లో టీ20 మ్యాచ్.. త్వరపడండి టిక్కెట్లు మొత్తం ఆన్‌లైన్

ABN , Publish Date - Oct 04 , 2024 | 09:28 PM

టెస్టును క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 6 నుంచి 12 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఓ మ్యాచ్ జరగనుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Hyderabad Match: మళ్లీ ఉప్పల్‌లో టీ20 మ్యాచ్.. త్వరపడండి టిక్కెట్లు మొత్తం ఆన్‌లైన్
india vs bangladesh 3rd T20 Match

భారత్ (team india) వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్ తొలి మ్యాచ్ అక్టోబర్ 6న గ్వాలియర్‌లో జరగనుంది. 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండడంతో అక్కడి అభిమానుల్లో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. దీని తర్వాత అక్టోబర్ 9న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్‌ అక్టోబర్‌ 12న హైదరాబాద్‌(hyderabad)లో మొదలవుతుంది. దీంతో బంగ్లాదేశ్ భారత పర్యటన ముగియనుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి మొదలవుతాయి.


టెక్కెట్ల ధరలు ఇలా

ఇప్పటికే మొదటి, రెండో మ్యాచ్ టిక్కెట్ల సేల్ మొదలైంది. ఈ క్రమంలోనే మూడో మ్యాచ్ టిక్కెట్ల సేల్ గురించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 12న భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరగనుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో టిక్కెట్లు అక్టోబర్ 5 నుంచి ఆన్‌లైన్ విధానంలో విక్రయించనున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎం ఇన్ సైడర్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో టిక్కెట్లు సేల్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక టిక్కెట్లు రూ.750 నుంచి గరిష్టంగా రూ.15 వేల వరకు ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు ఈ మ్యాచ్ కోసం ఆఫ్‌లైన్ విధానంలో టిక్కెట్ల విక్రయం లేదన్నారు.


సూర్యకుమార్ కెప్టెన్సీ

ఈ సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించారు. అతనితో పాటు సీనియర్ ఆటగాళ్ల పాత్రలో హార్దిక్ పాండ్యా కనిపించనున్నాడు. అయితే ఈ సిరీస్‌కు బీసీసీఐ ఏ ఆటగాడికి వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇవ్వలేదు. మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డిలకు తొలిసారి భారత జట్టుకు ఆడే అవకాశం లభించవచ్చు. ఇదిలా ఉంటే సంజు శాంసన్ కొత్త పాత్రలో కనిపించవచ్చని భావిస్తున్నారు. బహుశా అతను అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం పొందవచ్చు. అయితే ఈ సిరీస్‌ మొదలైతే కానీ ఈ విషయాలన్నీ తేలనున్నాయి. టెస్టు సిరీస్‌ మాదిరిగానే టీ20 సిరీస్‌లోనూ బంగ్లాదేశ్‌ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు టీమిండియా ప్రయత్నిస్తోంది.


ఇరు అంచనా జట్లు

భారత్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వీకే), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వీకే), అర్ష్‌దీప్ సింగ్ , హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్ జట్టులో నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తంజీద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహీద్ హృదయోయ్, మహ్మదుల్లా, లిటన్ కుమార్ దాస్, జకీర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్, తస్కిన్, తస్కిన్, తస్కిన్, సాకిబ్, రకీబుల్ హసన్


ఇవి కూడా చదవండి:

Suryakumar Yadav: అక్టోబర్ 6 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ టీ20.. అరుదైన ఫీట్ చేరువలో సూర్యకుమార్‌ యాదవ్..

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 04 , 2024 | 09:41 PM