Share News

Paris Olympics 2024: బ్యాడ్మింటన్‌లో చేజారిన పతకం..

ABN , Publish Date - Aug 05 , 2024 | 07:22 PM

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ చివరికి పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్‌‌ చేతిలో ఓటమితో ఫైనల్స్ ఆశలు చేజార్చుకున్న లక్ష్యసేన్.. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందాడు.

Paris Olympics 2024: బ్యాడ్మింటన్‌లో చేజారిన పతకం..
Lakshya Sen

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ నిరాశపర్చాడు. పతకం ఆశలను వమ్ము చేశాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సెన్‌‌ చేతిలో ఓటమితో ఫైనల్స్ ఆశలు చేజార్చుకున్న లక్ష్యసేన్.. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి చెందాడు. తొలి సెట్‌ను తేలికగా గెలుచుకున్న లక్ష్యసేన్ రెండు, మూడు సెట్లను వరుసగా చేజార్చుకున్నాడు. గాయంతో ఇబ్బంది పడటంతో వరుస రెండు సెట్లలో ఓటమి చవిచూశాడు. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో మలేషియాకు చెందిన లీ జీ జియా లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు. 14-21, 21-16, 21-11 తేడాతో వరుసగా రెండు సెట్లను గెలుచుకుని మలేషియా ఆటగాడే కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు నిరాశ మిగిలింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ 7 క్రీడాకారుడు లీ జీ జియా ప్రపంచ నెంబర్ 19 క్రీడాకారుడు లక్ష్యసేన్‌పై విజయం సాధించాడు. మొదటి సెట్‌లో అధిక్యాన్ని కనబర్చిన లక్ష్యసేన్.. రెండు, మూడు సెట్లలో వెనుకబడ్డాడు. దీంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Olympics 2024: శభాష్‌.. శ్రీజేష్‌


పతకం లేకుండానే..

ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ సింగిల్స్ విభాగంలో తొలి పతకం సాధించిన భారత ఆటగాడుగా లక్ష్యసేన్ చరిత్ర సృష్టిస్తాడని అంతా ఆశించారు. తొలిసెట్‌లో అద్భుత విజయం సాధించడంతో భారత్‌కు పతకం గ్యారంటీ అనుకున్నారు. కానీ చేతి గాయం కారణంగా లక్ష్యసేన్ పతకం లేకుండానే ఒలింపిక్స్‌ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.. ఇప్పటివరకు ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత్ మూడు పతకాలు గెలవగా.. మహిళల విభాగంలోనే ఈ మూడు పతకాలు సాధించింది. తొలిసారి పురుషుల సింగిల్స్‌లో భారత్ పతకం సాధించింది. 2012 ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ కాంస్య పతకం గెలవగా.. 2016 ఒలింపిక్స్‌లో పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో రజతం, 2020 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.

జొకో సాధించాడు


ఓడినా పోరాడి..

పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో పతకాన్ని సాధించకపోయినా లక్ష్యసేన్ పతకం కోసం చివరి వరకు శ్రమించాడు. దీంతో లక్ష్యసేన్ ఆటతీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాడ్మింటన్‌లో కనీసం రెండు పతకాలు వస్తాయని ఆశలు పెట్టుకున్నప్పటికీ అసలు పతకం లేకుండానే భారత్ ఒలింపిక్స్‌ నుంచి బ్యాడ్మింటన్‌లో వెనుదిరగాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్‌లో ప్రీక్వార్టర్ దశలోనే సింధు ఓటమి చవిచూడటంతో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. లక్ష్యసేన్ బంగారు లేదా రజత పతకం సాధిస్తారని ఆశించినప్పటికీ.. సెమీస్‌లో ప్రపంచ నెంబర్ 2 విక్టర్ ఆక్సెల్సెన్‌‌ చేతిలో ఓటమి చెందాడు. చివరికి కాంస్య పతకం పోరులోనూ విజయం సాధించలేకపోయాడు. ఇటీవల కాలంలో లక్ష్యసేన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గ్రూప్ లెవెల్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచిన లక్ష్యసేన్.. ప్రీక్వార్టర్స్‌కు చేరాడు. రౌండ్ 16 మ్యాచ్‌లో భారత క్రీడాకారుడు హెచ్ ఎస్ ప్రణయ్‌పై గెలిచి క్వార్టర్స్‌కు ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ టిఎన్ చెన్ మొదటి సెట్ ఓడిపోయిన లక్ష్యసేన్ తరువాత వరుసగా రెండు సెట్లలో విజయం సాధించి సెమీస్‌‌కు చేరాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్స్‌ మ్యాచ్‌లో డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ ఆక్సెల్సెన్‌ చేతిలో పరాజయం చవిచూశాడు.

Paris Olympics 2024: సెమీస్ చేరిన భారత హాకీ జట్టు.. అడుగు దూరంలో పతకం


Gymnastics : బంగారు బైల్స్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 07:22 PM