Share News

5.5 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Jul 22 , 2024 | 12:12 AM

గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని ఆదివారం శంకర్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు.

5.5 కిలోల గంజాయి పట్టివేత

శంకర్‌పల్లి, జూలై 21: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని ఆదివారం శంకర్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 5.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ హబీబుల్లాఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన బిమల్‌నాయక్‌, ఉమే్‌షమాఝి కొన్నాళ్ల క్రితం శంకర్‌పల్లికి వచ్చి తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు కొద్ది రోజుల క్రితం ఒడిశా వెళ్లారు. మాణిక్య మాఝి అనే వ్యక్తి వద్ద గంజాయి కొని శంకర్‌పల్లికి తెచ్చారు. బిమల్‌, ఉమేష్‌ ఆదివారం శంకర్‌పల్లికి చెందిన అరుణ్‌కు గంజాయి అమ్మేందుకు రాగా, పోలీసులు బీడీఎల్‌ చౌరస్తా వద్ద పట్టుకున్నారు. వారి వద్ద 5.5కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jul 22 , 2024 | 12:12 AM