Share News

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీముగ్గురి దుర్మరణం

ABN , Publish Date - Sep 04 , 2024 | 06:31 AM

ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టగా ముగ్గురు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామశివారులో మంగళవారం జరిగింది.

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీముగ్గురి దుర్మరణం

  • నలుగురికి గాయాలు

పాలకుర్తి, సెప్టెంబరు 3: ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టగా ముగ్గురు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామశివారులో మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పాలకుర్తి నుంచి తొర్రూరుకు ప్రయాణికులతో వెళ్తుండగా వావిలాల గ్రామ శివారులోని మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం టీక్యా తండాకు చెందిన జాటో తు హేమాణి (55), బుజ్జి(50) దంపతులతోపాటు పాలకుర్తికి చెందిన ఎండి. నసీమా (55) మృతి చెందారు. లారీడ్రైవర్‌ మద్యం సేవించి వాహనం నడపడంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది

Updated Date - Sep 04 , 2024 | 06:31 AM