Share News

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Aug 26 , 2024 | 10:11 PM

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయూ టీఎస్‌ చేస్తున్న కృషి అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లిలోని ప్రైవేటు ఫంక్షన్‌హాలులో పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కా రానికి పీఆర్‌టీయూటీఎస్‌ పోరాటాలు చేసి విజయం సాధించిందన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

హాజీపూర్‌, ఆగస్టు 26: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయూ టీఎస్‌ చేస్తున్న కృషి అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లిలోని ప్రైవేటు ఫంక్షన్‌హాలులో పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కా రానికి పీఆర్‌టీయూటీఎస్‌ పోరాటాలు చేసి విజయం సాధించిందన్నారు. సమ స్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. దాదాపు 22 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. ఏడాదికి రెండు సార్లు టెట్‌ నిర్వహించాలని కోరారు. అనంతరం పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాసపల్లి రవి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షురాలు బండ శాంకరి, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2024 | 10:11 PM