నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
ABN , Publish Date - May 07 , 2024 | 10:23 PM
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ అన్నారు. ప్రలోభాలకు గురికాకుండా ఇష్టమైన నాయకుడికి ఓటువేయాలని కోరారు.
నెన్నెల, మే 7: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ అన్నారు. ప్రలోభాలకు గురికాకుండా ఇష్టమైన నాయకుడికి ఓటువేయాలని కోరారు. మండల కేంద్రంలో మంగళవారం కేంద్ర బలగా లతో కవాతు నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రత లకు భంగం కలిగించాలని చూసే ఊరుకునేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు.
ప్రధానంగా యువత సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. తప్పుడు పనులు చేసి కేసుల పాలు కావద న్నారు. డేవిడ్లాల్ తన్సిలామా, సీఐలు రాకేష్ మిశ్రా, విపిన్కుమార్, నెన్నెల ఎస్సై ప్రసాద్, హెచ్సీ విజయ్ తదితరులు పాల్గొన్నారు.