Share News

Kumaram Bheem Asifabad: నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

ABN , Publish Date - May 08 , 2024 | 11:04 PM

దహెగాం, మే 8: నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన మండలంలోని అయినం, చిన్నరాస్పెల్లి, దహెగాం, ఒడ్డుగూడ గ్రామాల్లో ఎరువులు, విత్తనాలు విక్రయించే దుకాణాలను తనిఖీ చేశారు.

 Kumaram Bheem Asifabad:  నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

దహెగాం, మే 8: నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన మండలంలోని అయినం, చిన్నరాస్పెల్లి, దహెగాం, ఒడ్డుగూడ గ్రామాల్లో ఎరువులు, విత్తనాలు విక్రయించే దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్‌ నిలువల రిజిస్టర్‌ను పరిశీలించారు. విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే రైతులకు రశీదులు అందజేయాలన్నారు. పత్తి, వరి, కంది విత్థనాలు విక్రయిస్తే రైతులకు రశీదులు ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎంఏవో వంశీకృష్ణ, ఏఈవోలు ఉన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:04 PM