Share News

Kumaram Bheem Asifabad: పోలీసు అమరవీరుల దినోత్సవం

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:02 PM

కాగజ్‌నగర్‌/పెంచికలపేట/దహెగాం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంలో బుధవారం రిటైర్డ్‌ఎంప్లాయీస్‌ ఉద్యోగసంఘభవన్‌లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు.

Kumaram Bheem Asifabad: పోలీసు అమరవీరుల దినోత్సవం

కాగజ్‌నగర్‌/పెంచికలపేట/దహెగాం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంలో బుధవారం రిటైర్డ్‌ఎంప్లాయీస్‌ ఉద్యోగసంఘభవన్‌లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా రిటైర్డ్‌ఎంప్లాయీస్‌ ఉద్యోగులసంఘం అధ్యక్షుడు జయదేవ్‌ మాట్లాడుతూ ప్రజలకోసం పోలీసులు తమప్రాణాలను ఫణంగా పెడతారన్నారు. కాగజ్‌నగర్‌, పెంచికల పేటలలో సీఐ శంకరయ్య, ఎస్సై కొమరయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల త్యాగం మరువలేని దన్నారు. కార్యక్రమంలో ఎస్సై దీకొండ రమేష్‌తో పాటు పోలీసులు, యువకులు లహన్‌రాజ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దహెగాం మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోలీసు స్టేషన్‌లో బుధవారం ఎస్సైరాజు ఓపెన్‌హౌజ్‌ కార్య క్రమం నిర్వహించారు. ఆయుధాల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు పలు విషయాలు అడిగితెలుసు కున్నారు. కార్యక్రమంలో ఏఎస్సై రమేష్‌, ఉపాధ్యా యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:02 PM