Share News

Kumaram Bheem Asifabad: 24 మందికి షోకాజు నోటీసులు

ABN , Publish Date - Jul 25 , 2024 | 10:55 PM

సిర్పూర్‌(టి), జూలై 25: మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం జాతీయ ఉపాధిహామీ పథకంలో 2023-24సంవత్సరంలో చేపట్టిన 386 పనులకు సంబంధించిన రూ.2,86,79,048 లకు గాను గ్రామీణఉపాధిహామీసిబ్బందితో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.

 Kumaram Bheem Asifabad:   24 మందికి షోకాజు నోటీసులు

- రూ.87,500 రికవరీ

- ఉపాధి హామీ ప్రజావేదిక

సిర్పూర్‌(టి), జూలై 25: మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం జాతీయ ఉపాధిహామీ పథకంలో 2023-24సంవత్సరంలో చేపట్టిన 386 పనులకు సంబంధించిన రూ.2,86,79,048 లకు గాను గ్రామీణఉపాధిహామీసిబ్బందితో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఇందులో 23 మంది ఫీల్డ్‌అసిస్టెంట్‌, టెక్నికల్‌అసిస్టెంట్లు, కార్యద ర్శులకు షోకాజు నోటీసులు జారీచేయగా, ఒకఫీల్డ్‌ అసిస్టెంట్‌పై విచారణ, రెండుపనులకు క్వాలిటీ కంట్రోల్‌ అధికారులతో తనిఖీచేపట్టాలని, రూ.42,50జరిమానా విదించామని డీఆర్డీవో పీడీసురేందర్‌ తెలిపారు. ఎంతటి వారైనా అవకతవకలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుం టామన్నారు. షోకాజు నోటీసులు అందకున్న వారుతప్పనిసరిగా సమాధానం ఇవ్వా లని, రివకరీడబ్బులు కట్టాలని ఆదేశించారు. కూలీ లకు రూ.2,67,05,875 చెల్లించగా ఇందులో రూ.19,73,170మెటీరియల్‌కు వాడారన్నారు. సిర్పూ ర్‌(టి)మండలంలో రూ.2,86,79,048 పనులు చేపట్టారన్నారు. ఈ నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, గత ఎంపీడీవో రాజేశ్వర్‌, ఏపీఎం చంద్రయ్య, ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, కార్యదర్శులు, సామాజిక తనిఖీ బృందం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2024 | 10:55 PM