Share News

Kumaram Bheem Asifabad: ఎన్‌ఏఎస్‌లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలి: డీఈవో

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:35 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 26: నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(ఎన్‌ఏఎస్‌)లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబర్చాలని డీఈవో అశోక్‌ అన్నారు.

Kumaram Bheem Asifabad:  ఎన్‌ఏఎస్‌లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలి: డీఈవో

- డీఈవో అశోక్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 26: నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(ఎన్‌ఏఎస్‌)లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబర్చాలని డీఈవో అశోక్‌ అన్నారు. శుక్ర వారం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులందరూ కనీసఅభ్యసన సామర్థ్యాలు సాధించేలా ప్రతిఉపాధ్యాయుడు విద్యాబోధన చేయాలన్నారు. నవంబర్‌లో నిర్వహించే నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలన్నారు. దానికి ప్రతి ఉపాధ్యా యుడు కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మానిటరింగ్‌ అధికారి శ్రీనివాస్‌, ప్రదానోపాధ్యాయుడు సుభాష్‌, ఆర్పీలు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 10:35 PM