Share News

ఇందిరమ్మ రాజ్యంలో పేదవారికి సంక్షేమ ఫలాలు

ABN , Publish Date - May 07 , 2024 | 10:27 PM

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి కాంగ్రెస్‌ సంక్షేమ ఫలాలు అందాయని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి మళ్ళీ సాధ్యమవు తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో పేదవారికి సంక్షేమ ఫలాలు

దండేపల్లి, మే7: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి కాంగ్రెస్‌ సంక్షేమ ఫలాలు అందాయని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి మళ్ళీ సాధ్యమవు తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని మంగళవారం తాళ్లపేట, నాగసముద్రం, మాకులపేట, లింగాపూర్‌. ఆల్లీపూర్‌, గుడిరేవు, మదాపూర్‌, నర్సాపూర్‌ గ్రామాలోని ఎన్ని కల ప్రచార సభలో మాట్లాడారు. ప్రతి పేదవాడికి ఇందిమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు. బీజేపికి ఓటు వేసి గెలిపిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అదికూడా బీజేపికి వేసినట్టే అన్నారు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఆగస్టు 15లోపే రైతులకు రూ. 2లక్షల పం ట రుణమాఫీ చేస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారన్నారు. ఆర్‌జీపిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, పార్టీ అధ్యక్షకార్యదర్శు వెంకటేశ్వర్లు, సతీష్‌, ఎంపీపీ శ్రీని వాస్‌, యూత్‌ అధ్యక్షుడు దుర్గప్రసాద్‌, మాజీ ఎంపీ పీలు కాంతరావు, శకుంతల, మాజీ వైస్‌ ఎంపీపీ రాజేందర్‌, ఎంపీటీసీలు శ్రీనివాస్‌, నవీన్‌, హేమ లత, మౌలిక మణేమ్మ, కమలాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 10:27 PM