వెంట వెంటనే ధాన్యం తరలించాలి
ABN , Publish Date - May 07 , 2024 | 10:24 PM
తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ మోతి లాల్ సూచించారు. నస్పూర్ పట్టణం సీతారాంపల్లి రైతు వేదిక వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళ వారం పరిశీలించారు.
నస్పూర్, మే 7 : తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ మోతి లాల్ సూచించారు. నస్పూర్ పట్టణం సీతారాంపల్లి రైతు వేదిక వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళ వారం పరిశీలించారు. ధాన్యం బస్తాలు తరలించడానికి లారీ లు సరిగ్గా రావడం లేదని అదనపు కలెక్టర్కు ఫోన్ చేసి కేంద్రం నిర్వాహకులు చెప్పా రు. దీంతో ఆయన కొనుగోలు కేంద్రానికి వచ్చి ధాన్యం నిల్వ లను పరిశీలించి రైస్ మిల్ల ర్లకు, లారీ ట్రాన్స్ఫోర్లు వారికి త్వరగా లారీలను పంపించి ధాన్యం తరలించాలని సూ చించారు. ఎప్పటి కప్పుడు ధాన్యంను తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ దర్ని మధుకర్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.